KTR | ముందు తరలిపోతున్న సంస్థలను ఆపండి: కేటీఆర్
పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ముందుగా రాష్ట్రం నుంచి తరలిపోతున్న సంస్థలను ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు.

విధాత, హైదరాబాద్ : పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ముందుగా రాష్ట్రం నుంచి తరలిపోతున్న సంస్థలను ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూస్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయని చెప్పారు. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోయిందని, కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకి తరలించిందని తెలిపారు.
We had worked very hard to convince Amara Raja to invest 9,500 Crore in Telangana. Government is an institution that has to ensure policy continuity
Brand Telangana should not suffer because of our political differences
I hope the Congress Govt will wisen up & honour the… pic.twitter.com/nd1nSf1OPO
— KTR (@KTRBRS) August 11, 2024
ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతున్ననదని.. తెలంగాణ బ్రాండ్కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని హెచ్చరించారు. అమరరాజా సంస్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆరెస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నానన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటం ఎంతమాత్రం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలన్నారు. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుందన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్గా ఉందని, కానీ స్వయంగా ముఖ్యమంత్రే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దివాళా తీసిందంటూ ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి ప్రకటనలు సీఎం రేవంత్రెడ్డి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.