KTR | రుణమాఫీపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ (Runa Mafi) పేరుతో మోసం చేసిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)కి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.

ఖర్గే, రాహుల్గాంధీలకు కేటీఆర్ బహిరంగ లేఖ
మీరిచ్చిన హామీ మేరకు అందరికి మాఫీ చేయాలని వినతి
KTR | తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ (Runa Mafi) పేరుతో మోసం చేసిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)కి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని లేఖలో కేటీఆర్ పేర్కోన్నారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నానని, తెలంగాణ (Telangana) లో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని కేటీఆర్ లేఖలో ఆరోపించారు.
40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ. 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచిందని, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలని తన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని, సీఎం రేవంత్రెడ్డి మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారన్న కేటీఆర్ ఈ లేఖలో ఆరోపించారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరపున కాంగ్రెస్ పార్టీపైన పోరాడుతామని తెలిపారు.