లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు
విధాత, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తామనే అంశాలను ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ‘న్యాయ్ పత్ర’ పేరుతో లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. సీఎం రేవంత్రెడ్డి కొత్తగా రాష్ట్రానికి సంబంధించి లోక్ సభ ఎన్నికల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తుండటంతో అందులో ఏయే అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.