ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ నుంచి బీఆరెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి బీఆరెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గురువారం కేసు విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం వాదనలు పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించి అదే రోజుకు విచారణ వాయిదా వేసింది.బీఆరెస్ నుంచి ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిర్ధిష్ట గడువులోగా అనర్హత అంశం తేల్చాలని స్పీకర్ ఆదేశాలివ్వాలంటూ తన వాదనలు వినిపించింది. అలాంటి ఆదేశాలిచ్చే అవకాశం కోర్టుకు లేదంటూ ప్రభుత్వం వాదించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram