మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏదీ చేసిన వైరల్గా మారడం రివాజుగా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచార క్రమంలో నాగారంలో ప్రచారానికి వెళ్లారు.
నేను మల్లన్నను..మీకు సేవ చేశానంటూ సందడి
పాత రోజులు గుర్తుకొచ్చాయంటూ వ్యాఖ్య
విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏదీ చేసిన వైరల్గా మారడం రివాజుగా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచార క్రమంలో నాగారంలో ప్రచారానికి వెళ్లారు. ఆ దారిలో కనిపించిన గేదెల పాకలోకి వెళ్లి వాటికి మేత(గడ్డి) వేశారు. నేను మల్లన్నను నేను మీకు సేవ చేసిననే అంటూ వాటికి గడ్డి పెట్టి తినమంటూ దండం పెట్టారు.
అయితే ఆ గేదే మల్లన్న చేతి గడ్డి మాత్రం తినలేదు. ఫోటోలకు ఫోజులిచ్చాకా మల్లారెడ్డి అక్కడి నుంచి ముందుకు కదిలారు. గేదెలను చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయంటూ ఈ సందర్భంగా మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పాలమ్మినా..పూలమ్మినా అంటూ తన పంచ్ మార్క్ డైలాగ్లతో అదరగొట్టే మల్లారెడ్డి మరోసారి తన పాత రోజులను తలపించేలా గేదెలకు గడ్డి వేసిన వీడియో వైరల్గా మారింది.