విధాత : బీఆరెస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇదే తరహాలో ప్రజలు బీఆరెస్ ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను బీఆరెస్ పార్టీ గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. బీఆరెస్ అధిష్టానం ఇప్పటికే లోక్సభ ఎన్నికల సన్నాహాలపై దృష్టి పెట్టి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో జరుగనుందని తెలిపారు.
మల్కాజిగిరి ఎంపీగా పోటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి పాట
బీఆరెస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
Latest News

ఇదెక్కడి చోద్యం? కాంట్రాక్టు ఉద్యోగి చేతికి ఐఏఎస్, ఐపీఎస్ ఫైళ్లు
రష్యా సర్కస్లో ప్రేక్షకుల మధ్యకు దూసుకెళ్లిన పులి.. వైరల్ వీడియో కలకలం
మే 1 నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగుల బదిలీలు
వన్ప్లస్ నార్డ్ CE 6 లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..!
ఇంకో 6 రోజుల్లో 'పెద్ది' షూటింగ్ పూర్తి : జూన్లో విడుదల
మూడేళ్ల అనుభవంతో రూ.9కోట్ల ప్యాకేజీ.. రిమోట్ జాబ్ ఆఫర్పై యువతి పోస్టు వైరల్
పాములతో ఫ్యామిలీ బిజినెస్.. కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి!
రైతు భరోసాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం
కేసీఆర్ తెలంగాణ ‘సెంటిమంట’ పండేనా! ఆ మూడు అంశాలపై మౌనమెందుకు?