కాంగ్రస్ పార్టీ ఘర్ వాపసీ మొదలు పెట్టామని, రెండు రోజులుగా ఈ ప్రకియ సాగుతుందని, పలు కారణాలతో ఇతర పార్టీల్లో చేరిన చాలమంది నాయకులండా తిరిగి సొంత పార్టీలోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వెల్లడించారు
సంగారెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యే చేరికకు గ్రీన్ సిగ్నల్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి
విధాత, హైదరాబాద్: కాంగ్రస్ పార్టీ ఘర్ వాపసీ మొదలు పెట్టామని, రెండు రోజులుగా ఈ ప్రకియ సాగుతుందని, పలు కారణాలతో ఇతర పార్టీల్లో చేరిన చాలమంది నాయకులండా తిరిగి సొంత పార్టీలోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘర్ వాపసీ పిలుపు నేపథ్యంలో ఎవరు వచ్చిన చేర్చుకుంటామని, సంబాని చంద్రశేఖర్ వంటి నాయకులు వెనక్కి వచ్చారన్నారు. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలాని పార్టీ సూచించిందని, నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరుతానన్నా తప్పక చేర్చుకుంటానని స్పష్టం చేశారు.
ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుందామని, మనకు పదవులు సోనియాగాంధీ.. రాహుల్ కష్టమేనని, కాబట్టి వాళ్ళ నిర్ణయం పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్.. ప్రియాంకగాంధీలదని, మనం వాళ్ళ నీడలో రాజకీయంగా బతుకుతున్నామన్నారు. క్షమించే తత్వం ఉన్న కుటుంబం వాళ్ళదని, నా దగ్గర పనిచేసిన వారు నాకు వ్యతిరేకంగా ఐదారుగురు పని చేశారని, సస్పెండ్ చేశామని, మళ్ళీ వస్తానంటే రమ్మని చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు.
సంగారెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతా అంటే నీ అభిప్రాయం ఏంటని మంత్రి దామోదర రాజనర్సింహ అడిగారని, వాళ్ళు ఎవరైనా అడిగితే జాయిన్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశానని, వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే అనే ప్రశ్నకు కూడా ఇచ్చేయండి అని చెప్పినట్లుగా జగ్గారెడ్డి వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని, అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్త అంటున్నాడని, మైనార్టీలు జాగ్రత్తగా ఉండి బీజేపీ మతతత్వ రాజకీయాలను తిప్పికొట్టి లౌకికవాద కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు.