విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల విషయంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్తు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖపైన నరసింహారెడ్డి ఎట్టకేలకు ఓ మీడియా చానల్తో స్పందించారు.
లేఖ అంశాలపై మంగళవారం సమీక్ష.. నిపుణలతో చర్చ
విధాత, హైదరాబాద్ : విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల విషయంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్తు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖపైన నరసింహారెడ్డి ఎట్టకేలకు ఓ మీడియా చానల్తో స్పందించారు. కేసీఆర్ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. లేఖలో కేసీఆర్ పేర్కోన్న అంశాలపై నిపుణులతో చర్చిస్తానని, వాస్తవాలపై బీహెచ్ ఈఎల్ ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు.
కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి తొలుత మీడియా సమావేశం నిర్వహించి కమిషన్ నుంచి తనను తప్పుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని భావించారు. అయితే కేసీఆర్ లేఖలో విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్ల నిర్మాణంలో సాంకేతిక, న్యాయ పరమైన అంశాలను ప్రస్తావించడంతో పాటు కమిషన్ విచారణ నిష్పాక్షికంగా లేదని తన వృత్తి నిబద్ధతను, విధి నిర్వాహణలో తన నిజాయితీని ప్రశ్నించడంతో జస్టిస్ నరసింహారెడ్డి ఖిన్నులయ్యారు. మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్న నరసింహరెడ్డి ఈ వివాదంలో కేసీఆర్కు ధీటైనా బదులివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా, అందుకు తగిన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.