KA Paul| కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.

విధాత, హైదరాబాద్ : ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)పై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో( Punjagutta Police Station) కేసు (Sexual Harassment Case) నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. లైంగిక ఆరోపణలపై ఆధారాలను బాధితురాలు షీ టీమ్కు అందించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఇటీవలే కేఏ పాల్ ఆస్తులకు సంబంధించిన వివాదం నెలకొంది. తన ఆస్తులను కొట్టేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనపై లైంగిక వేధింపులు కేసు నమోదు కావడం గమనార్హం.