తెలంగాణ తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిన మేరకు 2.25టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు
విధాత : తెలంగాణ తాగునీటి అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిన మేరకు 2.25టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2.25టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరగా కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించనున్నామన్నారు.
అలాగే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర మేరకే కొంటామని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరిస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని, మిల్లర్లు కొనుగోలు సందర్భంగా రైతుల ధాన్యం నుంచి తరుగు తీస్తే సహించేది లేదన్నారు.