రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఘాటుగా స్పందించారు
విధాత : రిజర్వేషన్ల రద్దు అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి ఘాటుగా స్పందించారు. నోటీస్లకు కాంగ్రెస్ నేతలెవ్వరూ భయపడబోరన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐలతో బెదిరించాలని చూస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్య అన్నారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపారని, అసలు సీఎం రేవంత్రెడ్డికి ఆ వీడియోలతో సంబంధం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 14సీట్లు గెలవబోతుందన్నారు.