CPI | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక
CPI | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రెండవ సారి ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహా ఏకగ్రీవ ఎన్నిక
CPI | హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రెండవ సారి ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ‘కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్'(గాజుల రామారం)లో జరిగిన సిపిఐ రాష్ట్ర నాలుగవ మహసభ చివరి రోజు శుక్రవారం నాడు నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పది మంది కార్యదర్శివర్గ సభ్యులు, 32 మంది కార్యవర్గ సభ్యులు సహా మొత్తం 101 మందితో నూతన రాష్ట్ర సమితి ఎన్నికైంది.
కార్యదర్శిగా కూనంనేని పేరును సిపిఐ సీనియర్ నాయకులు పల్లా వెంకట్రెడ్డి ప్రతిపాదించగా, కలవేన శంకర్ బలపర్చారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర సమితి ఏక్రగీవంగా ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర సమితికి క్యాండిడేట్ సభ్యులు, ఆహ్వానితులను, రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులను కూడా ఎన్నుకున్నారు. నూతన నాయకత్వాన్ని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా అభినందించారు. రాష్ట్రంలో సిపిఐని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన వారికి దిశానిర్ధేశం చేశారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు :
కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డ, పశ్య పద్మ, పల్లా వెంకటరెడ్డి, తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనర్సింహా, వి.ఎస్.బోస్, ఇ.టి.నరసింహా
రాష్ట్ర కార్యవర్గం:
కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనరసింహా, వి.ఎస్.బోస్, ఇ.టి.నరసింహా,బొమ్మగాని ప్రభాకర్, వి.సీతారామయ్య, పల్లా నర్సింహారెడ్డి, నెల్లికంటి సత్యం, ఎస్.కె.సాబీర్ పాషా, దండి సురేశ్, సి.హెచ్.రాజారెడ్డి, ఎస్.బాల్రాజ్, మందా పవన్, బి.విజయసారధి, కర్రె భిక్షపతి, పాలమాకుల జంగయ్య, ఎన్.జ్యోతి, బెజవాడ వెంకటేశ్వర్లు, ఛాయాదేవి, రామడుగు లక్ష్మణ్, కలకొండ కాంతయ్య, ఇ.ఉమా మహేశ్, పంజాల శ్రీనివాస్, ముత్యాల విశ్వనాథం, యానాల దామోదర్ రెడ్డి, షేక్ బాసుమియా
ఆహ్వానితులు:
గన్నా చంద్రశేఖర్, జమ్ముల జితేందర్రెడ్డి, రమావత్ అంజయ్య నాయక్, కల్లూరి వెంకటేశ్వరరావు, తాండ్ర సదానందం ఎన్నికవ్వగా, రంగారెడ్డి నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంది.
సిపిఐ నూతన రాష్ట్ర సమితి సభ్యులు
రాష్ట్ర కేంద్రం : కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, పల్లా వెంకట రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహా, ఇ.టి.నరసింహా, వి.ఎస్.బోస్, ఎన్.జ్యోతి, వి.సృజన, ఎస్.బాల్రాజ్, ఎం.డి.యూసుఫ్, కలకొండ కాంతయ్య, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర, కె.మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, వి.సీతారామయ్య, బొమ్మగాని ప్రభాకర్, బి.ఎస్.ఆర్.మోహన్రెడ్డి, ఎన్.మధుకర్, రమావత్ అంజయ్య నాయక్, పల్లె నర్సింహా, కె.శ్రీనివాస్ రెడ్డి, కె.ధనుంజయనాయుడు, మారపాక అనిల్కుమార్,
జిల్లాల నుంచి:
సుధాకర్(నిజామాబాద్), ఎల్.దశరథ(కామారెడ్డి), టి.ఎం.ఖాలీఖ్ (మెదక్), విజయలక్ష్మీ పండిట్ (వికారాబాద్), చెన్న విశ్వనాథం (జగిత్యాల), టి.నర్సింహా(నారాయణపేట్), బి.ఆంజనేయులు(గద్వాల్), బి.బాలకిషన్ (మహబూబ్నగర్), తోట మల్లిఖార్జున్రావు(ములుగు), ముడుపు ప్రభాకర్ రెడ్డి (ఆదిలాబాద్), బద్రి సాయికుమార్ (ఆసిఫాబాద్), మంద సుదర్శన్ (సిరిసిల్లా), కె.విజయరాములు (వనపర్తి), సయ్యద్ జలాలుద్దీన్ (సంగారెడ్డి), మేకల రవి, షేక్ బాసుమియా, పంజాల రమేశ్ (వరంగల్), పంజాల శ్రీనివాస్, అందె స్వామి (కరీంనగర్), రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్ (మంచిర్యాల), తాండ్ర సదానందం, గోశిక మోహన్ (పెద్దపల్లి), దండి సురేశ్, జమ్ముల జితేందర్ రెడ్డి, ఎర్ర బాబు, ఎస్.కె.జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు (ఖమ్మం), ఎస్.కె.సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, కె.సారయ్య, సారెడ్డి పుల్లారెడ్డి, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, మున్నా లక్ష్మీకుమారి(కొత్తగూడెం), ఎస్.ఎం.డి.ఫయాజ్ (నాగర్ కర్నూల్), మందా పవన్,కె.శంకర్ (సిద్ధిపేట్), నెల్లికంటి సత్యం, పల్లా నర్సింహా రెడ్డి, ఎల్.శ్రవణ్కుమార్ (నల్లగొండ), గన్నా చంద్రశేఖర్,బెజవాడ వెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు (సూర్యాపేట), గోదా శ్రీరాములు, యానాల దామోదర్రెడ్డి, బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య (యాదాద్రి భువనగిరి), పాలమాకులు జంగయ్య, పానుగంటి పర్వతాలు, కె.రామస్వామి, ఎం.డి.ఫమీదా, ఓరుగంటి యాదయ్య (రంగారెడ్డి), ఇ.ఉమా మహేశ్, జి.దామోదర్రెడ్డి (మేడ్చల్), కర్రె భిక్షపతి, అదారి శ్రీనివాస్, సిరబోయిన కరుణాకర్, మందా సదాలక్ష్మి (హన్మకొండ), కొరిమి రాజ్కుమార్ (భూపాలపల్లి), సి.హెచ్.రాజారెడ్డి , పాతూరి సుగుణమ్మ (జనగామ), బి.విజయసారధి, బి.అజయ్ సారధి(మహబూబాబాద్), స్టాలిన్, ఛాయాదేవి (హైదరాబాద్),ఇన్సాఫ్(1), నిర్మల్ జిల్లా(1), మజ్దూర్ ఫ్రంట్(1), రంగారెడ్డి (2) సభ్యులను ఎన్నుకోవలసి ఉంది.
క్యాండిడేట్ సభ్యులు :
ముడుపు నళిని(మహిళా ఫ్రంట్), ఎం.నర్సింహా, బి.వెంకటేశ్(ట్రేడ్ యూనియన్), ఆజ్మీరా రామ్మూరి(గిరిజన సంఘం), కె.భూమయ్య (ఎఐకెఎస్), కె.వి.ఎల్.(అయిప్సో), జోగుల మల్లయ్య (మంచిర్యాల), సిద్ధినేని కరుణాకర్ (ఖమ్మం), సలిగండి శ్రీనివాస్ (కొత్తగూడెం), బంటు వెంకటేశ్వర్లు(నల్లగొండ), ఉస్తేల నారాయణరెడ్డి(సూర్యాపేట), టి.రామకృష్ణ, బుద్దుల జంగయ్య(రంగారెడ్డి)
ఆహ్వానితులు :
కె.సూర్యనారాయణ (ఎఐకెఎస్), కె.శ్రీనివాస్ (ప్రజానాట్యమండలి), టి.వెంకట్రాములు(వృత్తి సంఘాలు), ఎస్.బాబు(ఆర్టిసి), జానకిరామ్ (బ్యాంకింగ్), వి.చెన్నకేశవరావు(సి.ఆర్.ఫౌండేషన్), ఉజ్జిని రత్నాకర్రావు(తెలంగాణ అమరవీరుల ట్రస్ట్), కట్టెబోయిన శ్రీనివాస్(మహబూబాబాద్), ఇప్పకాయల లింగయ్య, బొల్లం పూర్ణిమ (మంచిర్యాల), ఎం.డి.సలీమ్, బి.జి.క్లెమెంట్(ఖమ్మం), ఎస్.డి.సలీమ్, రావులపల్లి రవికుమార్, చండ్ర నరేంద్ర కుమార్(కొత్తగూడెం), వర్ల వెంకటయ్య, కౌకుంట్ల కేశవులుగౌడ్(నాగర్కర్నూల్), ఉజ్జిని యాదగిరిరావు(నల్లగొండ), ఆది సాయన్న (జనగామ), నల్లు సుధాకర్ రెడ్డి(మహబూబాబాద్), కమతం యాదగిరి, జి.చంద్రమోహన్గౌడ్ (హైదరాబాద్), తోట భిక్షపతి (హన్మకొండ), గౌతమ్ గోవర్ధన్ (పెద్దపల్లి), కె.ఏసురత్నం (మేడ్చల్ మల్కాజ్గిరి), వీరభద్రయ్య (సింగరేణి), సిద్ధిపేట (1),యాదాద్రి భువనగిరి(1), రంగారెడ్డి (1)ల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకోవలసి ఉంది.