ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. బుధవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. కవిత కస్టడీని పొడించిన కోర్టు తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం కస్టడీ కూడా పొడిగించడంతో కవితకు లిక్కర్ కేసులో అన్ని ఎదురుదెబ్బలే ఎదురవుతున్నాయి. ఈడీ అరెస్టు అనంతరం కవిత మార్చి 26 నుంచి తిహార్ జైలులోనే ఉంటున్నారు.