Nallagonda | నల్లగొండ జిల్లా( Nallagonda District ) తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలోని ఎల్లాపురం తండాకు చెందిన బాబు, కొర్ర పార్వతీకి కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. ముందే పేదరికం.. ఈ నలుగురి ఆడపిల్లలను( Girls ) సాదేందుకు ఆ దంపతులకు కష్టమొచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో( Financial Problems ) సతమతమవుతున్న బాబు, పార్వతీ.. ఓ చిన్నారిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఓ ఆడబిడ్డను( Younger Sister ) దళారుల ద్వారా రూ. 3 లక్షలకు గుంటూరు జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశారు. ఈ క్రమంలో చెల్లిని అమ్మొద్దు అంటూ ఇద్దరు అక్కలు( Elder Sisters ) వేడుకునే తీరు చూసి కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. కూలీనాలి చేసుకుని బతుకుదాం అని ఆ పిల్లలు తల్లిదండ్రులను వేడుకున్న తీరు అందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది.
నల్గొండ జిల్లాలో పేద, గిరిజన తండాలను టార్గెట్ చేసుకుని దళారులు శిశు విక్రయాలకు పాల్పడుతున్న తేలింది. ఈ దందా గత కొంతకాలంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే చెల్లిని అమ్మొద్దు అంటూ చిన్నారులు వేడుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
