మరింత దంచనున్న ఎండలు.. హాఫ్ సెంచరి దిశగా సూర్య ప్రతాపం
తెలంగాణలో సూర్యప్రతాపం 47డిగ్రీల చేరువకు దూసుకెలుతుంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఎండవేడితో తల్లడిల్లుతున్నారు
విధాత : తెలంగాణలో సూర్యప్రతాపం 50 డిగ్రీల చేరువకు దూసుకెలుతుంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఎండవేడితో తల్లడిల్లుతున్నారు. గురువారం అత్యధికంగా నల్గొండ జిల్లా దేవరకొండలో 48.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 49 డిగ్రీల మార్క్ను దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం,శనివారంలలో దీర్ఘకాల వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. అలాగే ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు కొనసాగాయి.
శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నెల 6న రాష్ట్రం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram