కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్సీగా ఉన్న టీ.జీవన్రెడ్డికి రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని
జీవన్రెడ్డికి ఎంపీ టికెట్ అనవసరమంటూ వ్యాఖ్యలు
చర్చనీయాంశమైన రేణుకాచౌదరి వ్యాఖ్యలు
విధాత : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్సీగా ఉన్న టీ.జీవన్రెడ్డికి రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని, స్థానికుడైన మండవ వెంకటేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వాల్సివుండేనని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. మండవను ఖమ్మం నుంచి పోటీ చేయించాలనుకుంటే స్థానిక కార్యకర్తలు ఒప్పుకోలేదన్నారు.
అనవసరంగా జీవన్రెడ్డిని నిజమాబాద్లో నిలబెట్టి, మండవను ఖమ్మంలో పోటీ చేయించే ఆలోచన చేసి రెండు సీట్లలో గెలికినట్లయ్యిందన్నారు. అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో భట్టి సతీమణి, తుమ్మల కొడుకు, పొంగులేటి సోదరుడు అంటే కార్యకర్తలు ఒప్పుకోలేదని గుర్తుచేశారు. చివరికి పొంగులేటి వియ్యంకుడు రామ సహాయం రఘురామరెడ్డికి కేటాయించారన్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్లు విషయంలో సీనియర్ నేత, ఎంపీ రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారాయి.