రాష్ట్రాలు రెండైనా తెలుగు జాతీ ఒక్కటే టీడీపీ అధినేత.. మాజీ సీఎం చంద్రబాబు

రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

రాష్ట్రాలు రెండైనా తెలుగు జాతీ ఒక్కటే టీడీపీ అధినేత.. మాజీ సీఎం చంద్రబాబు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటేనని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు

10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని, నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడిందన్నారు.ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని, నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని, రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.. సమగ్ర సాధికారత సాధించాలని పేర్కోన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు ఆవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని, భారతదేశం స్వాత్రంత్యం సాధించి వందేళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు.. అందులోనూ తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.