రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు
విధాత : రిజర్వేషన్ల రద్ధు అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసులు గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ సతీష్ తో పాటు నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారితో పాటు విష్ణు, వంశీ, గీత, శివలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో ఉండిపోవడం ఆసక్తి రేపుతుంది.