మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది.
విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ రోజు బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి,మత్తు మాఫియాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.