కేరళ ప్రకృతి సోగయాలను చూడాలనుకుటే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది
IRCTC Tourism | కేరళ ప్రకృతి సోగయాలను చూడాలనుకుటే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. భూలోక స్వర్గంగా భావించే కేరళ అందాలను చూసేందుకు ‘కేరళ హిల్స్ అండ్ వాటర్ పేరు’తో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఇందులో ఆరు రోజులు, ఐదురాత్రుల పాటు పర్యటన కొనసాగుతున్నది. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ఈ నెల 20న ప్రారంభంకానున్నది. ఈ ప్యాకేజీలో మున్నార్, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలను సందర్శించే వీలు కలుగనున్నది.
పర్యటన ఇలా..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 20న మధ్యాహ్నం 12.20 గంటలకు జర్నీ మొదలవుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 17230 నంబరు గల శబరి రైలులో బయలుదేరుతారు. రాత్రంతా ప్రయాణం కొనసాతుంది. రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్కు చేరుతారు. అక్కడి నుంచి మున్నార్కు వెళ్తారు. హోటల్లో చెకిన్ అయ్యాక సాయంత్రం మున్నార్ సిటీలోనే పర్యటన ఉంటుంది.
మూడోరోజు రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్లను సందర్శిస్తారు. రాత్రి మున్నార్లోనే బస ఉంటుంది. నాలుగో రోజు అలెప్పీకి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్లి హోటల్లోకి చెకిన్ అవుతారు. రెడీ అయ్యాక బ్యాక్ వాటర్ టూర్కి వెళ్తారు. రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది. ఐదో రోజు హోటల్ నుంచి చెకిన్ అయ్యాక ఎర్నాకులం చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర ఇలా..
కేరళ టూర్ ప్యాకేజీ కోసం వేర్వే ధరలను నిర్ణయించింది. స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ కేటగిరిలో స్లీపర్క్లాస్లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ కేటగిరిలో థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ కేటగిరిలో సింగిల్ షేరింగ్కు రూ.33,480, ట్విన్ షేరింగ్కు రూ.19370, ట్రిపుల్ షేరింగ్కు రూ.15,580గా ధర నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరిలో సింగిల్ షేరింగ్కు రూ.30,770, ట్విన్ షేరింగ్కు రూ.16,660, ట్రిపుల్ షేరింగ్కు రూ.12,880 నిర్ణయించారు.
అలాగే ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు సైతం వేర్వేరు ధరలను నిర్ణయించారు. బెడ్ అవసరమైతే ఒక ధర.. లేకపోతే మరో ధరను నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్సైట్, 9701360701, 8287932229, 9281495843 నంబర్లలో సంప్రదించాలని ఐఆర్సీటీసీ కోరింది. ప్యాకేజీలోనే రైలు టికెట్లు, ఏసీ వాహనంలో ప్రయాణం, మూడురాత్రులకు అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్సురెన్స్ కవర్ అవుతాయి. మిగతా వాటికి ప్రయాణికులు భరించాల్సి ఉంటుంది.