Site icon vidhaatha

చుక్క‌ల్లోకెక్కుతున్న‌ చమురు ధరలు

విధాత‌: దేశంలో మరోసారి చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.113.32కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.56 కి చేరింది.గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.115.30కి చేరింది. డీజిల్​పై 36 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.92 వద్ద కొనసాగుతోంది.వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.03 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.69కి చేరింది.

ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.73కు పెరిగింది.ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 33 పైసలు పెరిగి రూ.114.77కు చేరగా.. లీటర్​ డీజిల్ 38 పైసలు పెరిగి​​ రూ.105.83 వద్ద కొనసాగుతోంది.కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.

Exit mobile version