Site icon vidhaatha

తిరుపతిలో అలిపిరి వద్ద కారులో మంట‌లు.. ప్రయాణికులు సురక్షితం

విధాత : తిరుపతి అలిపిరి వద్ద కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. అలిపిరి వద్ద రోడ్డుపై వెలుతున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన కారు డ్రైవర్ వెంటనే ప్ర‌యాణికుల‌ను కారులో నుంచి దిగి వెళ్లేలా అప్రమత్తం చేశారు. వారంతా సురక్షితంగా కారులో నుంచి బయటపడ్డారు. కారులో నుంచి దిగిన భక్తులు దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు ఎలా వ‌చ్చాయన్నది తెలియాల్సివుంది.

Exit mobile version