నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

నోటిఫికేషన్‌ జారీచేసిన జేఎన్టీయూకే ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఆలస్య రుసుము లేకుండా జూలై 25 వరకు గడువు ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు విధాత‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే […]

నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ
  • నోటిఫికేషన్‌ జారీచేసిన జేఎన్టీయూకే
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మాత్రమే అనుమతి
  • ఆలస్య రుసుము లేకుండా జూలై 25 వరకు గడువు
  • ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు

విధాత‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ శనివారం(నేటి) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌/ఈఏపీసెట్‌’ను సందర్శించాలి.
కోర్సులు..
1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్‌), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ
3.బీఫార్మసీ, ఫార్మాడీ