విధాత:చట్టానికి విరుద్దంగా వైసిపి మంత్రి, ఎమ్మెల్యేలు బద్వేలులొ తిష్ట వేశారు.కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బద్వేలు వదిలి వెళ్లలేదు.సిఎం భారీ మెజార్టీ కోసం వారికి టార్గెట్ పెట్టారంటా.అందుకొసమని ఓటర్లను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని బిజేపి నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి కడపలో అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది.స్దానిక పోలీసులు విధులు పారదర్శకంగా నిర్వర్తించండి.వైసిపి నాయకులు ఓటర్లకు డబ్బులు ఇస్తే తీసుకొండి.మా ఓటర్లు, ఏజెంట్లు ఎవ్వరికి భయపడరు.కేంద్రబలగాలు ఉన్నాయి…ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకొండని వెల్లడించారు. […]
విధాత:చట్టానికి విరుద్దంగా వైసిపి మంత్రి, ఎమ్మెల్యేలు బద్వేలులొ తిష్ట వేశారు.కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బద్వేలు వదిలి వెళ్లలేదు.సిఎం భారీ మెజార్టీ కోసం వారికి టార్గెట్ పెట్టారంటా.అందుకొసమని ఓటర్లను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని బిజేపి నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి కడపలో అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది.స్దానిక పోలీసులు విధులు పారదర్శకంగా నిర్వర్తించండి.వైసిపి నాయకులు ఓటర్లకు డబ్బులు ఇస్తే తీసుకొండి.మా ఓటర్లు, ఏజెంట్లు ఎవ్వరికి భయపడరు.కేంద్రబలగాలు ఉన్నాయి…ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకొండని వెల్లడించారు.
బ్రహ్మంగారి మఠానికి దొంగ ఓటర్లను తరలించినట్లు సమాచారం ఉంది.ఇది ధర్మపోరాటం … మేము వెనకడుగు వేసే పరిస్దితి లేదు.గతంలో ఎన్నొ ఉప ఎన్నికలను చూశాము.ఇలాంటి ఉప ఎన్నికలు ఎప్పుడు చూడలేదన్నారు.తిరుపతి కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు.టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు బిజేపి 10 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.మా పార్టికి అలాంటి అలవాటు లేదు.విజయమ్మ అస్తులే కోట్లలొ ఉన్నాయని తెలిపారు.
గోవిందరెడ్డి లాగ అవినీతితో సంపాదించలేదు.అందుకే మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని వైసిపి పక్కన బెట్టారు.ఈ ఎన్నికల్లొ ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలి.న్యాయబద్దంగా గెల్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.