Earthquake | జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 5.35 గంటలకు బారాముల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న స్థానికులు భయంతో బయటకు పరుగెత్తారు. ఆందోళనకు గురయ్యారు. పఠాన్ ఏరియాలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు నిర్ధారించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6 గా నమోదైనట్లు పేర్కొన్నారు.