Earthquake In Kolkata : కోల్కతాను వణికించిన భూకంపం..జనం పరుగులు
కోల్కతాలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇండ్లు, అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి.
విధాత : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కొద్దిసేపటి క్రితం సంభవించిన భూకంపం నగర వాసులను వణికించింది. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదైంది. బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూప్రకంపనల ధాటికి.. ఇండ్లు, ఆఫీసుల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
భూప్రకంనల ధాటికి ఇళ్లలోని వస్తువులు చెల్లచెదురుగా పడిపోగా…పలు అపార్ట్ మెంట్ నివాసాలకు, ఇళ్ల గోడలకు పగుళ్లు సైతం ఏర్పడ్డాయి. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి :
Virosh | విజయ్-రష్మికల విద్యార్హతలపై ఆసక్తికర చర్చ.. ఎవరికెన్ని డిగ్రీలు
Pakistan vs Afghanistan : అఫ్టానిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్… సూసైడ్ స్క్వాడ్ తో అప్ఘాన్?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram