విధాత:ఓబుళదేవరచెరువు గ్రామీణ ప్రాంతాల్లో కరోనాతో బాధపడుతు మృతి చెందిన కుటుంబాల బాధితులకు ఆపద్భంధావులు- హెల్పింగ్ హ్యాండ్స్ తలభా సేవకులు పేర్కొంటూ వీరి సేవలకు వెలకట్టలేనివని ఎస్ఐ కే.గోపీ అభినందించారు.సెకండ్ వేవ్ కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాప్తిచెంది మృతి చెందిన కుటుంబాలకు అండగా వుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ తలబా సేవకులనుకొనియాడుతూ..ఆలయ నిర్మాణ సంకల్పకులు(పాత్రికేయులు)పచ్చార్ల ఆంజనేయులు నాయుడు,గౌనిపల్లి యువ సేవకులు మల్లెల రమేష్ చేపట్టిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో ఎస్ఐ కే.గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి […]
విధాత:ఓబుళదేవరచెరువు గ్రామీణ ప్రాంతాల్లో కరోనాతో బాధపడుతు మృతి చెందిన కుటుంబాల బాధితులకు ఆపద్భంధావులు- హెల్పింగ్ హ్యాండ్స్ తలభా సేవకులు పేర్కొంటూ వీరి సేవలకు వెలకట్టలేనివని ఎస్ఐ కే.గోపీ అభినందించారు.సెకండ్ వేవ్ కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాప్తిచెంది మృతి చెందిన కుటుంబాలకు అండగా వుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ తలబా సేవకులనుకొనియాడుతూ..ఆలయ నిర్మాణ సంకల్పకులు(పాత్రికేయులు)పచ్చార్ల ఆంజనేయులు నాయుడు,గౌనిపల్లి యువ సేవకులు మల్లెల రమేష్ చేపట్టిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో ఎస్ఐ కే.గోపి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రశంసించగా,యమ్పీడివో రఘునాధగుప్త,సర్పంచులు ముద్దుల గోవింద్,శంకర్ రెడ్డి,వ్యాయమ ఉపాధ్యాయులు జయం రాజేష్,ఐటిఐ ప్రిన్సిపాల్ ఆంజనేయులు, మాజీ కోఆప్షన్ మెంబర్ టైలర్ నిజాం, మండల సిపిఐ నాయకులు పూల శ్రీనివాసులు మున్నా,రామచంద్ర,హెడ్ కానిస్టేబుల్ గౌడ్,మహిళా పోలీసులు ధనలక్షీ,అరుణ,తేజాశ్వని,కుళ్ళాయమ్మ ఐటీఐ అధ్యాపకులు నారాయణస్వామి, గంగాధర తదితరులు పాల్గొని మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన కుటుంబీకులు,రక్త సంబంధికులు దహన సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో బాధితులకు మేమున్నామంటూ నిరంతరం అండగా వుంటూ పదుల సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న మండల హెల్పింగ్ హ్యండ్స్ తలబా యువకుల అమూల్యమైన సేవలకు హృదయ పూర్వక వందనాలు అంటూ కొనియాడారు.
వ్యాయమ ఉపాధ్యాయులు జయం రాజేష్ మాట్లాడుతూ బృహత్తర సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ హ్యండ్స్ తలబా యువకులు తమ శిష్యులు కావడం గర్వపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు.టైలర్ నిజాం,ఐటిఐ ప్రిన్సిపాల్,సిపిఐ నాయకులు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యండ్స్ తలబా చేపట్టిన యువకుల సేవలు ఓడీచెరువు మండలానికి చెందినవారు కావడం ఆనందంగా వుందని,ఇదే స్ఫూర్తితో మరిన్నీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహాకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు,మల్లెల రమేష్ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యండ్స్ తలబా యువకుల సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించాయని,యువకుల సేవలు పలువురు ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థి దశలో సేవా గుణాన్ని అలవర్చుకోవాలని,ఐటిఐ విద్యార్థులకు సూచించారు. అనంతరం హెల్పింగ్ హ్యండ్స్ టీమ్ నిర్వహకులు ఆరీఫ్ తోపాటు 14 మందిని వేదికపై ఎస్ఐ కే.గోపి చేతుల మీదుగా సన్మానం ప్రారంభించగా, యమ్పీడివో రఘునాథగుప్త, సర్పంచులు గోవిందు,శంకర్ రెడ్డి,వ్యాయమ ఉపాధ్యాయులు జయం రాజేష్,ప్రజా సంఘాల నాయకులు తదితరులు శాలువలు కప్పి పూలమాలతో సన్మానించారు.ఈకార్యక్రమంలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రాజేంద్ర,ఫీల్డ్ అసిస్టెంట్లు శివరామ్ నాయుడు,,రామకృష్ణవిజయశేఖర్ రెడ్డి,ఐటిఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.