Amalapuram | మహిళ కడుపులో 570 రాళ్లు.. షాకైన డాక్ట‌ర్లు, కుటుంబ స‌భ్యులు

అదేదో గ‌ట్టున ఉండే రాళ్ల కుప్ప కాదు.. ఏ న‌దిలోనో, స‌ముద్రంలోనో దొరికిన రాళ్లు కూడా కావు అవి. ఓ మ‌హిళ క‌డుపులో బ‌య‌ట‌ప‌డ్డ రాళ్ల రాశుల‌వి. ఆ మ‌హిళ గాల్ బ్లాడ‌ర్(పిత్తాశ‌యం) నుంచి ఏకంగా 570 రాళ్ల‌ను తొల‌గించారు.

  • Publish Date - May 21, 2024 / 12:16 PM IST

అమరావ‌తి : అదేదో గ‌ట్టున ఉండే రాళ్ల కుప్ప కాదు.. ఏ న‌దిలోనో, స‌ముద్రంలోనో దొరికిన రాళ్లు కూడా కావు అవి. ఓ మ‌హిళ క‌డుపులో బ‌య‌ట‌ప‌డ్డ రాళ్ల రాశుల‌వి. ఆ మ‌హిళ గాల్ బ్లాడ‌ర్(పిత్తాశ‌యం) నుంచి ఏకంగా 570 రాళ్ల‌ను తొల‌గించారు. ఈ ఘ‌ట‌న కోన‌సీమ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అల్ల‌వ‌రం మండ‌లం దేవ‌గుప్తం గ్రామానికి చెందిన జాలెం న‌ర‌స‌వేణికి 31 ఏండ్లు. ఆమె గ‌త కొంత‌కాలంగా విప‌రీత‌మైన క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోంది. దీంతో రెండు రోజుల క్రితం నొప్పి మరింత తీవ్రం కావ‌డంతో, చేసేదేమీ లేక అమ‌లాపురంలోని ఆస్ప‌త్రికి వెళ్లింది. దీంతో ఆమెకు వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పిత్తాశ‌యంలో రాళ్లు ఉన్న‌ట్లు తేలింది.

డాక్ట‌ర్ న‌ర్రా శ్రీనివాసులు ఆమెకు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. శ‌నివారం సాయంత్రం లాప్రోస్కోపీ ద్వారా ఏకంగా 570 రాళ్లు పిత్తాశ‌యం నుంచి తొల‌గించారు. ఆ రాళ్ల‌ను చూసి వైద్యులు, బాధితురాలి కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. ప్ర‌స్తుతం న‌ర‌స‌వేణి ఆరోగ్యంగా ఉంద‌ని, వైద్యులు తెలిపారు.

Latest News