విధాత: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పర్యాటకాభివృద్ధిపై మంత్రి మేకపాటి ప్రతిపాదనలను సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి మంత్రి మేకపాటి కేంద్ర మంత్రికి వివరించారు.
సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం సమర్పించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలం గా ఉన్నాయని కేంద్ర మంత్రికి మేకపాటి తెలిపారు. కాగా ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యా టక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు.