New couple | పెళ్లి చేసుకుని దైవ దర్శనానికి నూతన దంపతులు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు..!

New couple : ఆ ఇద్దరికి కొత్తగా పెళ్లయ్యింది. అనంతరం దైవ దర్శనం కోసం నూతన దంపతులు తిరుమలకు వెళ్లారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. దాంతో నూతన దంపతులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న వారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఆ కొత్త జంటను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

New couple | పెళ్లి చేసుకుని దైవ దర్శనానికి నూతన దంపతులు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు..!

New couple : ఆ ఇద్దరికి కొత్తగా పెళ్లయ్యింది. అనంతరం దైవ దర్శనం కోసం నూతన దంపతులు తిరుమలకు వెళ్లారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. దాంతో నూతన దంపతులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూస్తున్న వారికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే ఆ కొత్త జంటను పోలీసులు ఎందుకు అరెస్ట్‌ చేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన సాంబశివరావు అలియాస్ శివ, అలేఖ్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అలేఖ్య కుటుంబానికి వారి పెళ్లి ఇష‍్టం లేదు. దాంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో అలేఖ్య కుటుంబసభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో వారి కోసం ఎంక్వయిరీ చేసిన పోలీసులు.. కొత్త జంట శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్నట్లు గుర్తించి, విషయాన్ని తిరుచానూరు పోలీసులకు తెలిపారు.

దాంతో తిరుచానూరు పోలీసులు కొత్త జంట ఓ ప్రైవేటు వాహనంలో తిరుచానూరు సమీపంలోకి రాగానే అరెస్ట్‌ చేశారు. అనంతరం భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తామిద్దరం గత 11 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని పోలీసుల విచారణలో అలేఖ్య చెప్పింది. పైగా ఇద్దరం మేజర్లమని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. కాగా కొత్త జంటను భవానీపురం పోలీసులకు అప్పగించనున్నట్లు తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

అలేఖ్య తల్లిదండ్రులకు తమ వివాహం నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నారని పెళ్లి కొడుకు శివ ఆరోపిస్తున్నాడు. అలేఖ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.