రోశయ్య మృతి.. ప్రముఖుల సంతాపం
విధాత: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్,టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు,ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్,చిరంజీవీ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయాలకు రోశయ్య ప్రతీక అని ఆయన పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారు.ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, […]

విధాత: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్,టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు,ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్,చిరంజీవీ తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విలువలతో కూడిన రాజకీయాలకు రోశయ్య ప్రతీక అని ఆయన పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారు.ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని,తనకప్పగించిన ఏ బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహించేవారని కొనియాడారు.