ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు:డీజీపీ గౌతమ్ సవాంగ్

విధాత:మావోయిస్టు కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయ్యారు.ఈరోజు ఆరుగురు సరెండర్ అయ్యారు.డివిజనల్ కమాండర్ తో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు.గాదర్ల రవి సరెండర్ అయ్యారు.స్థానిక సమస్యలపై గతంలో మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు.ఇప్పుడు ప్రభుత్వం నుండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారమవుతున్నాయి.ట్రైబల్ ఏరియాల్లో 20వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది.గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.మహిళలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆదివాసీ గూడెం […]

ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు:డీజీపీ గౌతమ్ సవాంగ్

విధాత:మావోయిస్టు కమిటీ మెంబర్ గత నెల సరెండర్ అయ్యారు.ఈరోజు ఆరుగురు సరెండర్ అయ్యారు.డివిజనల్ కమాండర్ తో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు.గాదర్ల రవి సరెండర్ అయ్యారు.స్థానిక సమస్యలపై గతంలో మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు.ఇప్పుడు ప్రభుత్వం నుండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారమవుతున్నాయి.ట్రైబల్ ఏరియాల్లో 20వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది.గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది.మహిళలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఆదివాసీ గూడెం లకు సైతం చేరుతున్నాయి.బేస్ ఏరియాల్లో సైతం మావోయిస్టుల ప్రభావం తగ్గినట్టు రిపోర్టులు వచ్చాయి.గతంలో మావోయిస్టులు తిరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు పధకాలు అందుతున్నాయి.గతంలో మావోయిస్టులు పోరాటాలు, ఉద్యమాలు చేసేవారు.రక్తపాతం ద్వారా ఉద్యమం ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదివాసీలకు అర్ధమైంది.విద్య, వైద్యం సమస్యలు ఇప్పుడు ఆదివాసీలకు లేవు.స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు అంటున్నా గిరిజనులు ఆసక్తి చూపట్లేదు.గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవి ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవు.అనేకమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

గతనెల స్పెషల్ జోన్ కమాండర్ సరెండర్ అయ్యారు.ప్రజాస్వామ్యంలో హింస, రక్తపాతం ద్వారా సాధించేది ఏదీ ఉండదు.రూరల్, ట్రైబల్ ఏరియాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా రీచ్ అవుతున్నాయి.వలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుంది.నేరుగా లబ్దిదారులకు పధకాలు అందుతున్నాయి.రాష్ట్రంలో నూతన పాలనా విప్లవం వచ్చింది.పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయి.పోలీసుల భాష, ప్రవర్తనలో మార్పు వచ్చింది.పాడేరులో మెడికల్ కాలేజ్, బుట్టాయి గూడెం, రంప చోడవరంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ట్రైబల్స్ కు అనేక పదవులు ఇస్తున్నారు.మావోయిస్టులకి ఆదివాసీల మద్దతు లేదు.రిక్రూట్ మెంట్ కు ఏపీ యువత ముందుకు రాకపోవడంతో ఛత్తీస్ ఘడ్ నుండి రిక్రూట్ చేసుకుంటున్నారు.వాళ్లకు స్థానిక సమస్యలపై, తెలుగు భాషపై అవగాహన ఉండట్లేదు.పోరాటాలు లేకపోవడంతో కేవలం తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు.వాళ్లలో చాలామంది లొంగిపోవడానికి చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో వారికి ఉన్న హక్కు ప్రకారం వారిని జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరుతున్నాను..