SCR Special Trains | ఏపీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. సంక్రాంతికి మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్లు

SCR Special Trains | ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) సంద‌డి మొద‌లైంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో ఉన్న ఏపీ( AP ) వాసులంతా త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( South Central Railway ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

SCR Special Trains | ఏపీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. సంక్రాంతికి మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్లు

SCR Special Trains | హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) సంద‌డి మొద‌లైంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో ఉన్న ఏపీ( AP ) వాసులంతా త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో రైళ్లు( Trains ), బ‌స్సులు, ప్ర‌యివేటు వాహ‌నాల్లో ర‌ద్దీ అప్పుడే మొద‌లైంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( South Central Railway ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ ప్ర‌యాణికుల కోసం సంక్రాంతి పండుగ‌కు మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్ల‌( Special Trains )ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వెల్ల‌డించింది.

జ‌న‌వ‌రి 7 నుంచి 12 వ‌ర‌కు ప్ర‌త్యేక రైళ్లు

ఏపీలోని ప‌లు ప్రాంతాల‌కు జ‌న‌వ‌రి 7 నుంచి 12వ తేదీ మ‌ధ్యలో ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక రైళ్లు.. కాకినాడ టు వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం మధ్య రాకపోకలు కొన‌సాగించ‌నున్నాయి. ఆయా ట్రైన్లలో 1ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటాయయని వెల్లడించింది. ఆయా రైళ్లకు సంబంధించి బుకింగ్స్ కూడా ప్రారంభ‌మైన‌ట్లు తెలిపింది.

వీక్లీ స్పెషల్​ రైళ్ల పొడిగింపు

పలు రైల్వేస్టేషన్ల మధ్య ఇప్పటికే నడుస్తున్న వీక్లీ ట్రైన్లను సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌-అనకాపల్లి (ట్రైన్​ నం.07041) రైలు జనవరి 4, 11, 18వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అనకాపల్లి-సికింద్రాబాద్‌(నం.07042) రైలు జనవరి 5, 12, 19వ తేదీల్లో, హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌(నం.07075) రైలు జనవరి 9, 16, 23వ తేదీల్లో, గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌(07076) రైలు జనవరి 11 18, 25న బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.