మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు దాదాపు పదకొండేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక తమ గారాలపట్టికి క్లింకార అనే నామకరణం కూడా చేశారు. ఇక పాప పుట్టిన దగ్గరి నుంచి అభిమానులు చిన్నారి ఎలా ఉందో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన మాత్రం కూతురి ఫేస్ బయట కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా ఉపాసన గత ఏడాది జూన్ 20న పాపకు జన్మనిచ్చింది. పెళ్లైన దాదాపు పదకొండేళ్లకు రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఇక లిటిల్ మెగా ప్రిన్స్ రాక మెగా ఫ్యామిలీకి సరికొత్త ఆనందం తీసుకొచ్చి పెట్టింది.
ఇక పాప కోసం ఒక ప్రత్యేకంగా రూమును కూడా డిజైన్ చేయించారు. పాపని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. పాప పుట్టినప్పటినుంచి మెగా ఇంట్లో ఏ పండగ వచ్చినా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే క్లింకార ముఖాన్ని ఇప్పటి వరకు ఎవరికీ చూపించలేదు. దీంతో మెగా అభిమానులంతా క్లింకారాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో క్లింకారకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. క్లీంకారను చూసుకునే కేర్ టేకర్ గురించి.. ఆమె జీతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ల కొడుకు తైమూర్ని చూసుకున్ననానీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
ఈమె సెలబ్రిటీ నానిగా పేరు గావించింది. ఇప్పుడు ఆమె రామ్ చరణ్-ఉపాసనల కూతురు క్లింకారని చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో బిజీగా ఉండటంతో క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగిస్తే బాగుంటుందని వారు భావించి ఈ నానీని కేర్ టేకర్గా పెట్టుకున్నారట. ఆమె సెలబ్రిటీల పిల్లల్ని చాలా జాగ్రత్తగా, కంటికి రెప్పలా చూసకుంటుంతట. అందుకే ఆమెకు లక్షన్నర వరకు నెల జీతం అందిస్తున్నట్టు సమాచారం. గతంలో సావిత్రి షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ల దగ్గర కూడా పనిచేసారు. ఆమె ఫొటోలు కూడా అప్పుడప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఏది ఏమైన కేర్ టేకర్కి అంత జీతం ఇస్తున్నారంటే అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.