లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. హండియా కొత్వాలిలోని సైదాబాద్లోని భేస్కీ గ్రామ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చిన్నారుల అరుపులు విని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు చిన్నారుల వాహనంలోకి దింపారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన చిన్నారులకు స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్లోని భేస్కీ గ్రామ సమీపంలో బైక్ను కాపాడే ప్రయత్నంలో పిల్లలతో […]
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. హండియా కొత్వాలిలోని సైదాబాద్లోని భేస్కీ గ్రామ సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చిన్నారుల అరుపులు విని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు చిన్నారుల వాహనంలోకి దింపారు.
సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన చిన్నారులకు స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్లోని భేస్కీ గ్రామ సమీపంలో బైక్ను కాపాడే ప్రయత్నంలో పిల్లలతో నిండిన పాఠశాల బస్సు బోల్తా పడింది.
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జౌన్పూర్లోని శ్రీమతి కాంతి దేవి జనతా విద్యాలయ పర్మాన్పూర్ భారతీపూర్కు చెందిన పిల్లల బస్సు విజ్ఞాన యాత్ర కోసం మాన్గర్ ప్రతాప్గఢ్కు వెళ్తోంది. సైదాబాద్లోని భేస్కీ గ్రామం ముందు బస్సు చేరుకోగా, బైకర్ను రక్షించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 75 మంది పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కాగా, 30 మందికి పైగా చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ, సహాయక చర్యలు ప్రారంభించారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో భిస్కీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడిని కాపాడే క్రమంలో చిన్నారులతో నిండిన బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. చిన్నారుల కేకలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో నుంచి బయటకు తీశారు.
వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వారిని స్థానికులే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన 30 మందికి పైగా చిన్నారులను చికిత్స నిమిత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.