Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ షో పై పోలీసులకు ఫిర్యాదు
నాగార్జున హోస్ట్గా మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకుంటున్నారని ఆరోపిస్తూ గజ్వేల్కు చెందిన కొందరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విధాత, హైదరాబాద్ : ప్రముఖ హీరో నాగార్జున హోస్టుగా మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదు అని, బిగ్ బాస్ టీం కుటుంబ విలువలు పాటించని వారిని షోకు ఎంచుకుంటుందని ఫిర్యాదులో ఆరోపించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది వారు ఫిర్యాదులో అభ్యంతరాలు లేవనెత్తారు.
సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారని, వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని కోరారు. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బిగ్ బాస్ బ్యాన్ చెయ్యాలన్నారు. సీనియర్ హీరో నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని కోరారు.