దిల్ రాజు.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. సక్సెస్ ఫుల్గా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలని సైతం నిర్మిస్తూ ఉంటాడు. ఆ మధ్య దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. ఇక ఈ రోజు దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. దిల్ రాజు కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన రెండో పెళ్లి తర్వాత వచ్చిన ట్రోలింగ్, వాటి వలన తన భార్య ఎంత బాధపడిందో తాజాగా తెలియజేశాడు.
దిల్ రాజు మొదట అనితని వివాహం చేసుకున్నాడు. అయితే అనారోగ్య సమస్యలతో 50 ఏళ్ల వయస్సులో ఆమె కన్ను మూసింది. ఇక కొన్నాళ్లపాటు సింగిల్గానే ఉన్న దిల్ రాజు తేజస్విని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కూతురు దగ్గరుండి దిల్ రాజు రెండో పెళ్లి జరిపించింది. అయితే ఇప్పుడు తేజస్వినితో ఓ బాబుకి కూడా జన్మనిచ్చారు దిల్ రాజు. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా ఆ వయస్సులో పెళ్లి చేసుకోవడం పట్ల దిల్ రాజు పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. పెళ్లైన కొత్తలో దిల్ రాజు తన ప్రేమ గురించి బయటకు చెప్పడంతో దిల్ రాజుతో పాటు తేజస్వినిని తెగ ట్రోల్ చేశారట. వాటిని తేజస్విని తన భర్తకి చూపించి చాలా బాధపడిందట. అయితే అప్పుడు దిల్ రాజు వాటిని చాలా స్పోర్టివ్ గా తీసుకోని పాజిటివ్ థింకింగ్ తో ఉండాలని భార్యకి చెప్పారట.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగు వారిలో.. తాను ఒక కోటి మంది ప్రజలకు ప్రొడ్యూసర్ గా తెలిసి ఉంటాను. అయితే అందులో నన్ను ట్రోల్స్ లేదా కామెంట్స్ చేసే వారు మహా అయితే పదివేల మంది ఉంటారు. మిగిలిన వారు మనల్ని గౌరవిస్తున్న వారే కదా. వారిచ్చే గౌరవాన్ని మనం పట్టించుకోకుండా, ట్రోల్స్ చేసే వారిని పట్టించుకోవడం మన అమాయకత్వం అవుతుంది. నెగటివిటీని చూసి బాధ పడుతూ పోజిటివిటీని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ దిల్ రాజు ఆమెకి సర్ధి చెప్పాడట. ఆయన చెప్పిన మాటలని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్యకి ఒక కూతురు ఉండగా, ఆమె కూడా ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.