Gangs of Godavari| విశ్వక్ సేన్, నేహాశెట్టి జంటగా అంజలి ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మే 31న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యా
Gangs of Godavari| విశ్వక్ సేన్, నేహాశెట్టి జంటగా అంజలి ముఖ్య పాత్రలో రూపొందిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మే 31న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇక విశ్వక్ గురించి మాట్లాడుతూ.. తనలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ఎంతో తపన పడుతుంటాడు.అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉందని అన్నారు.
నేహాశెట్టి.. కత్తి, అంజలి.. ఖతర్నాక్ అని జెప్పిన బాలయ్య .. విష్వక్కు తన తల్లిదండ్రులే బ్యాక్గ్రౌండ్ అని తెలియజేశాడు. తన తండ్రి జాతకాలు, వాస్తు చూస్తుంటారు. మనల్ని కాపాడేది దైవ కాబట్టి విశ్వక్కి ఆ దైవం సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అన్నారు. త్వరలో విష్వక్తో కలిసి సినిమాని ప్రకటించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్ అందించారు. ఇక ఈ ఈవెంట్లో హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నందమూరి నటసింహం, కొణిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నారని చెప్పిన హైపర్ ఆది.. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, మాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా అంతే కిక్ వస్తుందని అన్నారు.
జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కల్యాణ్ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం తెరపడే వరకు పిఠాపురంలోనే ఉన్నారు హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో కూడా ఆయన పర్యటించడం మనం చూశాం. అయితే సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్, బాలయ్యల రాజకీయ ప్రస్తావన హైపర్ ఆది తీసుకురావడంతో ఈ విషయం ఇండస్ట్రీలోను, అటు
రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది.