Samantha | భారతీయ చిత్రాల్లో పాటలు తప్పనిసరి. లేకపోతే సినిమాలన్నీ అసంపూర్ణంగా ఉంటాయి. పాటలు సినిమా హిట్ కావడంలోనూ కీలక పాత్రలు పోష్తింటాయి. దీనికి తోడు ఐటెం సాంగ్ కూడా తోడైతే చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్టయినా, కాకపోయినా ఐటెం సాంగ్స్ మాత్రం సినిమాని లైమ్లైట్లోకి తీసుకువస్తుంటాయి. బాలీవుడ్లో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి అభిమానులను అలరించారు. ఐటెం సాంగ్స్ కోసం ఏకంగా కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్లో ఎవరు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు. అది ఎవరో కాదు చెన్నై బ్యూటీ సమంత రూత్ ప్రభు. బాలీవుడ్ బ్యూటీలను తోసిరాజని అందరికంటే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నది.
రూ.5కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నది సమంత..?
బాలీవుడ్లో ఎక్కువగా మలైకా అరోరా, నోరా ఫతేహి, తమన్నా భాటియా, సన్నీ లియోన్, కత్రినా కైఫ్ను తోసిరాజని సమంత రూత్ ప్రభు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకున్నది. ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో ‘ఊ అంటవా మావ’ పాట కోసం రూ.5కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. అయితే, ఒక్క సాంగ్ కోసం ఇది భారీ మొత్తమే. ఐటమ్ సాంగ్స్కు పెట్టింది పేరైనా నోరా ఫతేహి ఒక్కో పాటకు రూ.2కోట్ల వరకు తీసుకుంటుంది. సన్నీ లియోన్ సైతం అంతే మొత్తం వసూలు చేస్తుంది. మలైకా అరోరా ఒక్కో పాటకు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుంటుంది. మలైకా అరోరా బెస్ట్ డ్యాన్సర్ అయిన రెమ్యునరేషన్ మాత్రం తక్కువగానే ఉన్నది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కరీనా కపూర్ ఐటెం సాంగ్ కోసం రూ.1.5కోట్ల వరకు వసూలు చేసేది. తమన్నా భాటియా సైతం ఒక్కో పాటకు రూ.కోటి వరకు వసూలు చేసింది. వీరిద్దరి కంటే కత్రినా కైఫ్ అత్యధికంగా రూ.2కోట్లకుపైగానే వసూలు చేస్తుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సైతం ఒక్కో పాటకు రూ.3కోట్ల వరకు తీసుకుంటున్నది.