విధాత:దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమలో చెన్నై చంద్రంగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొన్నియిన్ సెల్వన్', 'చదురంగ వేట్టై-2', 'రాంగీ', 'గర్జనై' వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క 'పొన్నియిన్ సెల్వన్' మినహా మిగిలిన చిత్రాల షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో దర్శక దిగ్గజం మణిరత్నం తెరెక్కిస్తున్న 'పొన్నియిన్ […]
విధాత:దక్షిణభారత చలన చిత్ర పరిశ్రమలో చెన్నై చంద్రంగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో ‘పొన్నియిన్ సెల్వన్’, ‘చదురంగ వేట్టై-2’, ‘రాంగీ’, ‘గర్జనై’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఒక్క ‘పొన్నియిన్ సెల్వన్’ మినహా మిగిలిన చిత్రాల షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అదే సమయంలో దర్శక దిగ్గజం మణిరత్నం తెరెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని తన భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ఆమె ఏ ఒక్క చిత్రంలోనూ కమిటవలేదు. అంటే, త్రిష త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని,అందుకే ఆమె కొత్త ప్రాజె క్టులను అంగీకరించడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని ఆమెకు సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే త్రిష స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. కాగా, గతంలో వరుణ్ మణియన్ అనే బిజినెస్మేన్తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత ఈ ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష ఒంటరిగానే ఉంటోంది.