Heroine| ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ అందు
Heroine| ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది.. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా వెలుగుతూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అలరిస్తుంది నివేదా. అయితే అరవ అమ్మాయి అయిన నివేదా తమిళంలో కన్నా కూడా తెలుగులో రాణించే ప్రయత్నం చేస్తుంది. మదురైలో పుట్టిపెరిగిన ఆమె తమిళ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోని,విజయ్ సేతుపతి లాంటి హీరోల సరసన నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ.
ఆ మధ్య టాలీవుడ్ లో అల్లు అర్జున్తో అలవైకుంఠపురములో చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రెడ్ వంటి సినిమాలతో కూడా అలరించింది. అయితే సినిమాలు నివేదాకి పెద్దగా సక్సెస్ ఇవ్వకపోవడంతో ఈ భామ దృష్టి ఇప్పుడు వెబ్ సిరీస్లపై ఉంది. రీసెంట్ గా పరువు అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది . ఈ సిరిస్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా పోలీసులతో గొడవ పడ్డట్టు ఓ వీడియో విడుదల చేసి అందరి దృష్టి ఆకర్షించింది. ముందు ఆ వీడియో చూసి అందరు నిజమే అని అనుకున్నారు. కాని తర్వాత విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. అయితే నివేదా.. ఓ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నట్టు తన కోరిక గురించి మాట్లాడుతూ.. నాకు ప్లం లిప్స్ అంటే చాలా ఇష్టం.. నా పెదాలు కూడా అలా మార్చుకోవాలని ప్రయత్నం చేశాను. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని మా ఫ్యామిలీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాను.. ఇంజెక్షన్ తీసుకుంటావా అని అడిగారు. సరే అన్నాను.. అయితే నిన్ను చంపేస్తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అని డాక్టర్ సరదాగా బెదిరించాడని నివేదా చెప్పుకొచ్చింది. అలాంటివి మంచివి కావని, భవిష్యత్లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించినట్టు నివేదా పేర్కొంది. చాలా మంది హీరోయిన్లు ముఖాలు మార్చుకుని.. రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సాయి పల్లవి, నిత్యా మీనన్ వంటి వారు మేకప్ కూడా సరిగ్గా ఇష్టపడరు అంటూ నివేదా ఆసక్తికర కామెంట్స్ చేసింది.