వైఎస్‌ వివేకా హత్య కేసు:మరికాసేపట్లో గుంటూరు కోర్టుకి సునీల్ యాదవ్.

విధాత:మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుడిగా వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.పరారీలో ఉన్న సునీల్ యాదవ్ ను సోమవారం రాత్రి గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం మంగళవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఈ విషయాన్ని దిల్లీలోని సీబీఐ ప్రజాసంబంధాల అధికారి ధ్రువీకరించారు.వివేకా హత్యకు ముందు,ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన […]

  • Publish Date - August 4, 2021 / 09:54 AM IST

విధాత:మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అనుమానితుడిగా వైకాపా కార్యకర్త యాదటి సునీల్‌ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.పరారీలో ఉన్న సునీల్ యాదవ్ ను సోమవారం రాత్రి గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం మంగళవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

ఈ విషయాన్ని దిల్లీలోని సీబీఐ ప్రజాసంబంధాల అధికారి ధ్రువీకరించారు.వివేకా హత్యకు ముందు,ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన సీబీఐ.మార్చిలో సునీల్ యాదవ్ ని డిల్లీలో విచారించిన సీబీఐ. ఆ తర్వాత పులివెందులలోని ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు.అప్పటి నుండి సునీల్ యాదవ్ కోసం గాలిస్తున్న సీబీఐ అధికారులు.

Latest News