జ్యోతిష్యం ప్రకారం శనివారం రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ఏ దేవుడినైనా ఆరాధించొచ్చు. ఇక శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి, కోపాన్ని నియంత్రించుకోవడానికి భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక పూజల నేపథ్యంలో శనివారం రోజు ఈ ఐదు పనులు అసలు చేయకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ చేస్తే శనీశ్వరుడు ఆగ్రహం వ్యక్తం చేసి, సమస్యలు సృష్టిస్తాడనేది పండితుల విశ్వాసం.
చేయకూడని పనులు ఇవే..
- జ్యోతిష్య శాస్త్రంలో శనివారం శనీశ్వరుడికి ఆవనూనె నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది. అయితే పొరపాటున కూడా శనివారం నూనె కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆ రోజున ఆవాల నూనెను కొనుగోలు చేయడం వలన వ్యాధి బారిన పడతారని విశ్వాసం.
- హిందూ సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం శనివారం ఉప్పు కొనుగోలు చేయవద్దు. శనివారం ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోని సభ్యులు అప్పులు పాలవుతారని విశ్వాసం. అంతేకాదు ఆ ఇంట్లోని వారి ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎవరైనా ఉప్పు కొనవలసి వస్తే శనివారం కొనకూడదు. మరొక రోజు కొనాలి. లేకపోతే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
- హిందూ గ్రంధాల ప్రకారం శనీశ్వరుడు చెడు దృష్టితో ఉంటే సాధారణ పూజలు చేస్తేనే అనుగ్రహము కలుగుతుందని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో శనివారం భాగస్వామితో సంబంధానికి దూరంగా ఉండండి.. ఇలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు.
- శనివారం పొరపాటున కూడా బొగ్గు కొనుగోలు చేయవద్దు. శనివారం బొగ్గును కొనుగోలు చేయడం అశుభం. ఈ రోజున బొగ్గును కొనుగోలు చేస్తే శనీశ్వరుడు ఆగ్రహానికి గురవుతారని విశ్వాసం. జీవితంలో పురోగతిలో అనేక అడ్డంకులను సృష్టిస్తుందని చెప్పబడింది.
- అదే విధంగా శనీశ్వరుడు ఆధ్యాత్మికతను, సత్యాన్ని పెంపొందించే గ్రహం కనుక శనివారం పాలు తీసుకోవద్దు. ఒకవేళ పాలు తాగాల్సి వస్తే అందులో పసుపు వేసుకోవాలి.