కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని, శ్రీరామ వంశజులు పరిపాలించారు. అందరూ సత్యధర్మవర్తనులుగా, ప్రజలను తమ పిల్లలుగా భావించి, జనరంజకంగా ఏలినవారే. శ్రీరామచంద్రుడికి ముందు తరాలవారెవరు అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. ఎంతోమంది గొప్పగొప్ప మహారాజులు, సత్యసంధులు, వీరాధివీరులు, చక్రవర్తులు ఈ వంశవృక్షంలో ఉన్నారు. సూర్యవంశంగా పేరుగాంచిన ఈ వంశం ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమైందో ఇప్పుడు చూద్దాం.
- బ్రహ్మ కొడుకు మరీచి
- మరీచి కొడుకు కాశ్యపుడు
- కాశ్యపుడి కొడుకు సూర్యుడు
- సూర్యుడి కొడుకు మనువు
- మనువు కొడుకు ఇక్ష్వాకువు
- ఇక్ష్వాకువు కొడుకు కుక్షి
- కుక్షి కొడుకు వికుక్షి
- వికుక్షి కొడుకు బాణుడు
- బాణుడి కొడుకు అనరణ్యుడు
- అనరణ్యుడి కొడుకు పృధువు
- పృధువు కొడుకు త్రిశంఖుడు
- త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు
- దుంధుమారుడి కొడుకు మాంధాత
- మాంధాత కొడుకు సుసంధి
- సుసంధి కొడుకు ధృవసంధి
- ధృవసంధి కొడుకు భరతుడు
- భరతుడి కొడుకు అశితుడు
- అశితుడి కొడుకు సగరుడు
- సగరుడి కొడుకు అసమంజసుడు
- అసమంజసుడి కొడుకు అంశుమంతుడు
- అంశుమంతుడి కొడుకు దిలీపుడు
- దిలీపుడి కొడుకు భగీరధుడు
- భగీరధుడి కొడుకు కకుత్సుడు
- కకుత్సుడి కొడుకు రఘువు
- రఘువు కొడుకు ప్రవుర్ధుడు
- ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు
- శంఖనుడి కొడుకు సుదర్శనుడు
- సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు
- అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు
- శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు
- మరువు కొడుకు ప్రశిష్యకుడు
- ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు
- అంబరీశుడి కొడుకు నహుషుడు
- నహుషుడి కొడుకు యయాతి
- యయాతి కొడుకు నాభాగుడు
- నాభాగుడి కొడుకు అజుడు
- అజుడి కొడుకు ధశరథుడు
- ధశరథుడి కొడుకు రాముడు
- రాముడి కొడుకులు లవకుశులు
దాశరథుల పుత్రులు:
రాముడు : – లవ , కుశ
లక్ష్మణుడు – : చిత్రాంగదుడు , చంద్రకేతు
భరతుడు – : తున్నీలుడు , పుష్కరుడు
శతృఘ్నుడు : – సుబాహు , శోరశేణుడు
రాముని తర్వాతి తరం:
రాముడు, కుశుడు, అతిథి, నిషాధ, నల, నభస, పుండరీక, క్షేమధన్వ, దేవనిక, అహినాగు, పరిపత్ర, దల, ఉన్నాభ, వజ్రనాభ, శంఖణ, వ్యుషిత్సువ, విష్వసాహ, హిరణ్యనాభ, కౌసల్య, బ్రహ్మిష్ఠ, పుత్ర, పుష్య, ధృవసంధి, సుదర్శన, అగ్నివర్ణ, మరు, ప్రసృత, సుసంధి, అమర్ష & సహస్వంత, విశృశ్వంత (అమర్ష), బృహద్బల
బృహధ్బలుడు:-
మహాభారత యుధ్ధ సమయానికి ఇతను మధ్య & దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించేవాడు. ఇతను పాండవులకు వ్యతిరేకంగా పోరాడి అభిమన్యుడి చేతిలో మరణిస్తాడు. భీష్ముని ప్రకారం ఇతను రథుడు మాత్రమే.
తరువాత…
బృహధ్భలుడు, బృహత్క్షయ, ఊరుక్షయ, వాతక్షయ, ప్రతివ్యోమ, దివాకర, సహదేవ, బృహదశ్వ, భానురథ, ప్రతితశ్వ, సుప్రతీక, మరుదేవ, సునక్షత్ర, కిన్నెర, అంతరిక్ష, సువర్ణ, సుమిత్ర, అమిత్రజిల, ధర్మిన, కృతంజీవ
సంజయ, మహాకోశల, ప్రసేనజిత, క్షుద్రక, కులక, సురథ, సుమిత్ర.
సుమితృడు:-
ఇతను రఘువంశ రాజులలో ఆఖరివాడు. ఇతను నంద వంశ & మగధ దేశ రాజు మహాపద్మనందుని చేతిలో ఓడిపోతాడు. దీనితో రఘువంశరాజుల పాలన సమాప్తమవుతుంది.
ఈ నందులను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు.
శల్యుడు:-
లవకుశుల తరంలోని వాడైన మద్రదేశాధిపతి అయిన శల్యుడు కుడా పాండవులకు వ్యతిరేకంగా యుధ్ధం చేస్తాడు. ఇతను నకుల,సహదేవుల మేనమామ, తల్లి అయిన మాద్రి సహోదరుడు.
నాడు – నేడు :-
- భరతుడు తక్షశిల ను ఏర్పాటు చేస్తాడు. ప్రస్తుతం పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రం లో ఇస్లామాబాద్ సమీపం లో ఉంది.
- లక్ష్మణుడు లక్ష్మణపురి ని ఏర్పాటు చేస్తాడు. అదే నేటి ఉత్తరప్రదేశ్ లోని లక్నో.
- శతృఘ్నడు మధువనం అడవిలో నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే నేటి ఉత్తరప్రదేశ్ లోని మధుర.
- 4. లవకుశులు జన్మించిన వాల్మీకి అశ్రమం నేడు రామతీర్ధం . పంజాబ్ లోని అమృత్ సర్ సమీపం లో కలదు.
- లవుడు దక్షిణ కోసల రాజ్యాన్ని పాలిస్తాడు. నేడు ఛత్తీస్ ఘడ్ లోని భిలాస్ పూర్ ప్రాంతం గా చెప్తారు.
- కుశుడు శ్రావస్తి నగర కేంద్రం గా ఉత్తర కోసల రాజ్యాన్ని పాలిస్తాడు. నేడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ & ఖుషి నగర్ ప్రాంతం.
థాయ్ ల్యాండ్ లోని లావోస్ నగరం కూడా లవుని పేరు మీదుగా ఏర్పడినదే. బ్యాంకాక్ సమీపంలో కల లబ్ పురి ని తక్షశిల రాజైన కలవర్నదిశుడు ఏర్పాటు చేశారని అంటారు.మహాభారత కాలానికి కోసలరాజ్యం 5 భాగాలుగా విభజించబడింది. మధ్య, తూర్పు, దక్షిణ – మగధ రాజ్యం గా జరాసంధుడు పాలించేవాడు.