TTD News | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో 18న శ్రీరామ పట్టాభిషేకం జరుపనున్నారు.
TTD News | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో 18న శ్రీరామ పట్టాభిషేకం జరుపనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. 18న రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు వేడుకలకు తిరులమ తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.