TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదినాన్ని సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి ఆలయంలో 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరుపనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదినాన్ని సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి ఆలయంలో 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరుపనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుడి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.