తిలకం పెట్టుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారమే నుదిటిపై తిలకం పెట్టుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. తిలకం పెట్టుకునేందుకు ఏ వేలును ఉపయోగించాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది..? సరైన రీతిలో తిలకం పెట్టుకోకుంటే ఎలాంటి సమస్యలు ఎదురువుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూవుల్లో చాలా మంది నుదుటిని తిలకం లేదా బొట్టు ధరించనిది ఇంటి నుంచి బయటకు వెళ్లరు. తిలకానికి హిందూవులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత మొదట నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్న తర్వాతే శుభకార్యాలను ప్రారంభిస్తారు. దేవుళ్లను ఆరాధిస్తారు. అయితే నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది శతాబ్దాల నుంచి కొనసాగుతున్న ఆచారం. బొట్టును గౌరవ చిహ్నంగా కూడా భావిస్తారు. అంతేకాదు నుదిటిపై తిలకం పెట్టుకుంటే ఒక వ్యక్తి మానసిక సమతుల్యతను పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆ వ్యక్తిపై దేవుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతుంటారు.
అయితే తిలకం పెట్టుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారమే నుదిటిపై తిలకం పెట్టుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. తిలకం పెట్టుకునేందుకు ఏ వేలును ఉపయోగించాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది..? సరైన రీతిలో తిలకం పెట్టుకోకుంటే ఎలాంటి సమస్యలు ఎదురువుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చూపుడు వేలు అడుగు భాగంలో బృహస్పతి పర్వతం ఉంటుంది. బృహస్పతిని దేవ్ గురు అని పిలుస్తారు.అమరత్వానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి, పూర్వీకుల శ్రాద్ధం చేసేటప్పుడు, చూపుడు వేలితో తిలకం పెట్టాలి. దీనితో పాటుగా చూపుడు వేలితో మృత దేహంపై కూడా తిలకం వేస్తారు. ఈ వేలితో జీవించి ఉన్న వ్యక్తిపై ఎప్పుడూ తిలకం పెట్టకూడదు. అది అశుభం. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీరు బొట్టు పెట్టిన వారికి కూడా సమస్యలు తలెత్తుతాయి.
జ్యోతిష్య శాస్త్రంలో మధ్య వేలికి ప్రాధాన్యత ఉంది. ఈ వేలు మూల భాగంలో శని పర్వతం ఉంది. శని దేవ్ న్యాయం, రక్షకుడు, ఆధ్యాత్మికతకు కారకంగా ఈ వేలిని పరిగణిస్తారు. మధ్యవేలితో తిలకం పెట్టుకుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందట. కాబట్టి చాలా మంది మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటుంటారు.
ఉంగరపు వేలు సూర్య దేవునికి సంబంధించినది. ఎందుకంటే దాని బేస్ వద్ద సూర్యుని పర్వతం ఉంది. కాబట్టి ఈ వేలితో దేవతామూర్తుల విగ్రహం లేదా చిత్రపటంపై తిలకం రాయాలి. దీనితో పాటు, మతపరమైన కార్యక్రమాలలో కూడా ఈ వేలితో తిలకం పెడతారు. ఉంగరపు వేలితో పాటు దేవతామూర్తుల చిత్రపటంపై మరేదైనా వేలితో బొట్టు పెడితే మీరు కోరుకున్న ఫలితాలు రావు.
బొటనవేలు దిగువన వీనస్ పర్వతం ఉంది. శుక్రుడు ఆనందం, వైభవం, శ్రేయస్సు చిహ్నంగా పరిగణిస్తారు. అతిథులకు తమ బొటనవేలుతో తిలకం పెట్టడానికి కారణం ఇదే.
తంత్ర కార్యకలాపాలలో చేతి చిన్న వేలును ఉపయోగిస్తారు. అందువల్ల, ఈ వేలితో ఏ వ్యక్తికి తిలకం పెట్టకూడదు.