యాదాద్రిలో భక్తుల కిటకిట
తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతినొందిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు
వేసవి సెలవులతో పెరిగిన రద్ధీ
విధాత, హైదరాబాద్ : తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతినొందిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు కళాశాలలు..పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో భక్తుల రద్ధీ పెరిగింది. తెల్లవారుజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కొండపైన ఆలయ ప్రాంగణంలోని పరిసర ప్రాంతాల్లో లడ్డు కౌంటర్లు, కల్యాణ కట్ట లాంటి ప్రదేశాలు భక్తుల రద్ధీతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పట్టడంతో భక్తుల వేసవి ఎండల తాపానికి ఇబ్బంది పడ్డారు. అయితే దేవస్థానం భక్తులకు షెడ్లతో పాటు మంచినీళ్లు..క్యూలైన్లలలో మజ్జిగ సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టడం భక్తులకు ఊరటనిచ్చింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram