AP 10th result | ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ విజయవాడలో ఫలితాలు విడుదల చేస్తారు. ఏపీ 10వ తరగతి పరీక్షలను మొత్తం 6,30,633 మంది రాశారు.
AP 10th result : ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ విజయవాడలో ఫలితాలు విడుదల చేస్తారు. ఏపీ 10వ తరగతి పరీక్షలను మొత్తం 6,30,633 మంది రాశారు.
మార్చి 30న పదవ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ఎస్సెస్సీ బోర్డు ముందుగా ప్రకటించిన విధంగానే మొత్తం ప్రక్రియ పూర్తయిందని పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 26 జిల్లాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని ఆయన చెప్పారు.