పాన్ ఇండియా గుర్తింపు సంపాదించిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఓ కొత్త ఫీచర్ ఫిల్మ్ ప్రకటించబడింది. ఈ చిత్రాన్ని Ess Kay Gee Entertainment, Benchmark Storytellers సంయుక్తంగా నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతలను ఆర్జే షాన్ చేపట్టగా, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియో భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా, భావోద్వేగాలు–మానసిక ఒత్తిళ్ల మద్య నడిచే కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. గతంలో అనుపమ–షాన్ కలయికలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ డిజిటల్ వేదికలపై మంచి స్పందన తెచ్చుకుంది. ఆ విజయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఈ జోడీ బిగ్ స్క్రీన్పై మరోసారి తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. టైటిల్ను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అనుపమ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించడం విశేషం. మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారీ ప్రయత్నాన్ని ప్రారంభించారు.
ఇటీవల జటాధర నిర్మాణంతో గుర్తింపు పొందిన Ess Kay Gee Entertainment సంస్థ తమ నిర్మాణ పరిమాణాన్ని మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో Rustom, Toilet: Ek Prem Katha, Pad Man, Pari వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
అనుపమ కెరీర్ విషయానికి వస్తే Premam, Karthikeya 2, రాక్షసుడు వంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ కొత్త సైకాలజికల్ థ్రిల్లర్తో అనుపమ మరోసారి తన నటనలో కొత్త కోణాన్ని చూపిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
